నేటి నుంచి దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్...

నేటి నుంచి దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-41,553 మంది విద్యార్థులకు దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించినట్లు విద్యాశాఖ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఈరోజు నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని తెలిపారు. జులై 2 వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని, 6న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. కాగా తొలి విడతలో 76,290 మందికి సీట్లు దక్కగా 57 వేల మంది మాత్రమే ప్రవేశాలు పొందారు.