సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - అధికారులకు ఎమ్మెల్యే మదన్ సూచన  

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - అధికారులకు ఎమ్మెల్యే మదన్ సూచన  

ఎల్లారెడ్డి, ముద్ర : నియోజకవర్గంలో ఉన్న పలు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సూచించారు.  శనివారం ఎమ్మెల్యే మదన్ మోహన్  ఆధ్వర్యంలో డివిజనల్, మండల అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో పాటు డివిజనల్, మండల అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగాఎమ్మెల్యే  మదన్ మోహన్  మాట్లాడుతూ సమస్యలతో వచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించి వాటికీ పరిష్కారం చేసే విధంగా అడుగులు వేసి,ప్రతి ఎల్లారెడ్డి పౌరుడి న్యాయం చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారులకు పలు కీలక సలహా, సూచనలను ఎమ్మెల్యే మదన్ మోహన్ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ కు, ప్రభుత్వ అధికారులకు మదన్ మోహన్  కృతజ్ఞతలు తెలిపారు. మదన్ మోహన్  చేసిన సలహాలకు సూచనలకు ప్రభుత్వ అధికారులు సానుకూలంగా స్పందించారు.