లంచం తీసుకుంటూ ఏ సీ బీ అధికారులకు పట్టుబడ్డ ఎలక్ట్రిసిటీ ఏ ఈ

లంచం తీసుకుంటూ ఏ సీ బీ అధికారులకు పట్టుబడ్డ ఎలక్ట్రిసిటీ ఏ ఈ

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా లోని కీసర మండలం ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏ ఈ) అనిల్ కుమార్ ఓ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటుండగా  మంగళవారం ఏ సీ బీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కీసర మండలం లోని చీర్యాల గ్రామ పరిధిలోఓ ట్రాన్స్ ఫార్మర్ బిగించడానికి ఏ ఈ అనిల్ కుమార్  కాంట్రాక్టర్ నర్సింహ ను 15 వేల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరికి రూ.12 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకునీ ఆ డబ్బులు ఇస్తుండగా ఏ సీ బీ డీఎస్పీ సూర్య నారాయణ రెడ్డి దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఈ డబ్బును స్వాధీనం చేసుకుని  ఏ ఈ అనిల్ కుమార్ ను ఆరెస్ట్ చేశారు. అల్వాల్ లోని ఆయన నివాసం లో కూడా ఏ సీ బీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.