నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు స్పాట్ డెడ్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు స్పాట్ డెడ్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సాపల్లి బైపాస్ రోడ్డు శివారులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ లో భవన నిర్మాణ రంగంలో పనిచేసే ఎనిమిది మంది కార్మికులు తమ పని ముగించుకొని ఆటోలో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బోధన్ మండలం ఊటపల్లి గ్రామానికి చెందిన వీరందరు లో బైపాస్ రోడ్డు గుండా వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న  వాహనం ఢీ కొట్టింది. దీంతో ఆటో నడుపుతున్న ప్రశాంత్, చరణ్ నాయక్, రేఖ, శ్యామ్ లు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో నలుగురికి తీవ్ర గాయలవగా వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఏసీపీ కిరణ్ చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 6వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఈసంఘటనతో ఊట పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.