ఉప్పరిపేటలో శ్రీదాసాంజనేయ స్వామీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని ఉప్పరిపేట పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీదాసాంజనేయ స్వామీ దేవాలయం నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, టి. విజయ లక్ష్మి దేవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులను పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం సభ్యులు సన్మానించారు. వారి వెంట కౌన్సిలర్ నక్క జీవన్, మాజీ కౌన్సిలర్ అల్లాల సరిత తదితరులు పాల్గొన్నారు