కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాలుగు వేల పెన్షన్: రాహుల్ గాంధీ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతులకు ఇచ్చే పెన్షన్లను రూ. 4 వేలకు పెంచుతామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన చేస్తున్నాడని, పేదల భూములన్నీ కేసీఆర్ చేతుల్లో ఉన్నాయని విమర్శించాడు. గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇచ్చిందని, కేసీఆర్ వాటిని లాక్కుంటున్నాడని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే గిరిజనులందరికీ భూములు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో కర్ణాటక ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఖతం అయిందని, అడ్రస్ లేకుండా పోయిందరని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీజేపీ బీ టీం అని అన్నారు.