వైకుంఠ రథాన్ని ప్రారంభించిన గద్వాల ఎమ్మెల్యే

వైకుంఠ రథాన్ని ప్రారంభించిన గద్వాల ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల ఎమ్మెల్యే కీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ బొక్కేతో ఘన స్వాగతం పలికారు.ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ సంబందించిన వైకుంఠ రథం 13, లక్షల 65 వేల రూపాయలు వ్యయంతో నూతనంగా కొనుగోలు చేసిన వైకుంఠ రథాన్ని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, చేతుల మీదుగా రిబ్బన్ కట్టింగ్ చేసి జెండాను ఊపి ప్రారంభించడం జరిగింది. వైకుంఠం రథాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ... అనాధలకు నిరుపేదలకు గద్వాల పట్టణ ప్రజలకు అందరికీ పురపాలక సంఘం ఆధ్వర్వంలో వైకుంఠ రాదన్ని అందుబాటులోకీ తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.ఎస్ కేశవ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య,  జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపి ప్రతాప్ గౌడ్,  జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్, మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, శ్రీను, మహేష్, నరహరి గౌడ్, కృష్ణ నాగరాజు, కో.ఆప్ నెంబర్ అబ్దుల్ మోబిన్, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ధర్మ నాయుడు,  ఆలయం కమిటీ డైరెక్టర్  కుమ్మరి రాము, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సత్య రెడ్డి, రామకృష్ణ శెట్టి, రంజిత్, షుకర్, సుధాకర్, రిజ్వాన్, భగీరథ వంశీ, కురుమన్న, పవన్ యాదవ్, రమేష్ రెడ్డి, మోబిన్, రాముడు, జగదీష్ , కృష్ణ, వీరేష్, గట్టు, ధరూర్ మండల పార్టీ యూత్ అధ్యక్షులు, సంతోష్, పురుషోత్తం రెడ్డి, మున్సిపాలిటీ అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు  కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.