రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గాజర్ల అశోక్ @ఐతు

రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గాజర్ల అశోక్ @ఐతు

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు గురువారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఇప్పటికే తన సహచరులు, అనుచరులతోపాటు వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరిపిన అశోక్‌ వారి సూచనల మేరకు కాంగ్రెస్‌ పార్టీ లో  చేరారు. ఆయన పార్టీ లోకి రావడం మూలంగా పార్టీలో చేరికలు ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి వరంగల్‌ జిల్లాలో ఇప్పుడు గాజర్ల అశోక్‌ కాంగ్రెస్‌ చేరడం సంచలనంగా మారింది..