ఇంటి పర్మిషన్, ఇంటి నెంబర్ లకు ప్రభుత్వ ఫీజు మాత్రమే చెల్లించాలి - మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ

ఇంటి పర్మిషన్, ఇంటి నెంబర్ లకు ప్రభుత్వ ఫీజు మాత్రమే చెల్లించాలి - మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ

మెట్‌పల్లి ముద్ర:- పట్టణ ప్రజలు ఇంటి పర్మిషన్, ఇంటి నంబర్ లు పొందేందుకు ప్రభుత్వం విధించిన ఫీజు మాత్రమే చెల్లించాలని మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ తెలిపారు. పట్టణ ప్రజలు మున్సిపల్ కు ఏదైనా పని నిమిత్తం వెళ్ళేటప్పుడు దళారులను ఆశ్రయించవద్దని. మోటేషన్, పే లైసెన్స్, పుట్టిన, మరణ ధృవీకరణ పత్రాలకు ప్రభుత్వం నిర్ణయించిన మున్సిపల్ ఫీజు కంటే ఎక్కువ ఏ అధికారికి ఇవ్వద్దని తెలిపారు.మున్సిపల్ కార్యాలయంలో వసూళ్లకు పాల్పడుతున్న ఉద్యోగుల వివరాలు చైర్ పర్సన్ సెల్ నంబర్ 9866638585 కు ఫోన్ ద్వారా  తెలపాలని సూచించారు.