ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

కాటారం, ముద్ర న్యూస్: కాటారం మండలం ధన్వాడ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు.ఉదయం 5 గంటల నుంచి ఆంజనేయ స్వామికి హోమం, ప్రత్యేక పూజలు కొనసాగాయి. ముందుగా గణపతి పూజా, పుణ్యాహవచణము, 51 కలశాలతో పంచామృత అభిషేకము, అష్టోత్రము,తమలపాకులతో పూజ, మన్య సూక్త,రుద్ర సూక్త హోమములు,బలి ప్రధానము, మహా పూర్ణాహుతి,మంగళహారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.వేదపండితులు శ్రీరాంబట్ల క్రిష్ణమోహన్ శర్మ, సాయిశర్మ,లవకుష్ లు వేద మంత్రోచ్చరణ చేస్తూ హోమం క్రతువునుజరిపారు.అనంతరం శ్రీదత్తాత్రేయ స్వామి వారిని దర్షణం చేసుకుని వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఈకార్యక్రమంలో అల్లాడి చంద్రమౌళి,మహేష్, కారెంగుల శ్రీనివాస్ గౌడ్, మారగోని వెంకటేష్ గౌడ్,రాజబాపు గౌడ్,కార్తీక్ గౌడ్,తుల్సెగారి మల్లయ్య,తోట కిషోర్, కుమార్ గౌడ్,బీముని సత్యం లు పాల్గొన్నారు.