జాబ్ మేళా కు విశేష స్పందన....

జాబ్ మేళా కు విశేష స్పందన....

మెట్‌పల్లి ముద్ర:- పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కు విశేష స్పందన లభించింది. విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో ఇంటర్వ్యూ కు హాజరయ్యారు. టైమ్స్ ప్రో ఆధ్వర్యంలో జాబ్ మేళా ను నిర్వహించగా సుమారు 200 మంది డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతి యువకులకు ఇంటర్వ్యూ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్బంగా కరస్పండెంట్ బెజ్జరపు వేణు గోపాల్ మాట్లాడుతూ నిరుద్యోగ నిర్ములన కు ఈ ప్రాంత యువకుల కు ఇలాంటి జాబ్ మేళాలు కృషి చేస్తాయని, విద్యార్థుల మెలకువలు నేర్చుకోవడం జరుగుతుందని ఈ ప్రాంత నిరుద్యోగులు గతంలో జరిపిన జాబ్ మేళాల్లో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని మా కళాశాలకే కాకుండా ఈ ప్రాంత నిరుద్యోగుల ఉద్యోగాల కల్పనకు ఇలాంటి మేళాలు మరెన్నో నిర్వహిస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమం లో సంస్థ ప్రతినిధులు వినయ్ కుమార్, ప్రిన్సిపాల్ కోలు రవి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యాపకులు ఆయా కంపెనిల ప్రతినిధులు పాల్గొన్నారు.