అంబేద్కర్ జీవితం బావి తరాలకు ఆదర్శం: ఎంపీపీ జంగం శ్రీనివాస్

అంబేద్కర్ జీవితం బావి తరాలకు ఆదర్శం: ఎంపీపీ జంగం శ్రీనివాస్

పెద్దశంకరంపేట, ముద్ర: అంబేడ్కర్ జీవితం నేటి బావి తరాలకు ఆదర్శం ఆని ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. పెద్దశంకరంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విగ్రహానికి ఎంపీపీ జంగం శ్రీనివాస్ పూలమాలలు వేసి, నివాళులర్పించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్ర నేటి బావి తరాలకు ఆదర్శం ఆని అన్నారు.

ఈ కార్యక్రమంలో  పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ గౌడ్, ఎం.పీ.టీ.సీ సభ్యులు విగ్రాం వీణా సుభాష్ గౌడ్, సంతోష్, పట్టణ మాల సంఘం అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, సంఘ బాధ్యులు సంగమేశ్వర్, నాందేడ్ దుర్గయ్య, నాందేడ్ లక్ష్మయ్య, నాందేడ్ లక్ష్మణ్, బాలరాజు, బేగరి లింగం, బేగరి అనిల్, బేగరి లింగయ్య, నాందేడ్ నాగరాజు, సురేష్, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.