సిపిఐ ఆధ్వర్యంలో చైర్మన్ కు సన్మానం.
మోత్కూర్,ముద్ర: ఇటీవల మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన గుర్రం కవిత లక్ష్మీనరసింహారెడ్డిని సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి అన్నెపు వెంకట్, పట్టణ కార్యదర్శి పుల్కరం మల్లేష్, చాపల అంజయ్య , గొలుసుల యాదగిరి, తాడూరు లక్ష్మీనరసయ్య, పోచం కన్నయ్య, కడమంచి వీరస్వామి, నిలిగొండ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ కవిత లక్ష్మి నరసింహరెడ్డిమాట్లాడుతూ రాజకీయ భేదాభిప్రాయాలు లేకుండా మున్సిపల్ అభివృద్ధికి అందరం కృషి చేద్దామని ఏమైనా లోపాలు జరిగినచో తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేసుకోవచ్చని అన్నారు.