కుంభం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

కుంభం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

భూదాన్ పోచంపల్లి, ముద్ర;భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని కనుముక్కుల గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో కుంభం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. పార్టీలో చేరిన వారు చుక్క వెంకటేష్, మంచాల లింగయ్య , పనుమటి పుల్లారెడ్డి, చుక్క శేఖర్, చుక్క బాబు చేరికయ్యారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, పాక రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.