దేశంలో ఎక్కడా లేని పథకాలు గులాబీ పార్టీలో ఉన్నాయి 

దేశంలో ఎక్కడా లేని పథకాలు గులాబీ పార్టీలో ఉన్నాయి 
  • పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
  • బీఆర్ఎస్ లో చేరిన వెయ్యి మంది ముస్లింలు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్రంలో అమలు చేస్తున్నారని  పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో ముస్లిం మైనార్టీ నాయకులు జహీర్ భారీ సంఖ్యలో యువకులు, మహిళలతో కలిసి గులాబీ దండులో చేరారు. కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, మైనార్టీ బందు, బీసీ బందు, కెసిఆర్ కిట్టు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం లాంటి ఎన్నో పథకాలు తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. నిరుపేదల తెలుగులో నింపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గత పాలకుల హయాంలో నియోజకవర్గ పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదని గత తొమ్మిదిన్నర ఏళ్ల 40 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చేశామన్నారు.

కేసీఆర్  మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్  సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి వేలాదికోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిందని, పట్టణంలో రహదారులను విస్తరించడంతోపాటు డివైడర్లు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. మినీ ట్యాంక్ బండ్ ను అద్భుతంగా నిర్మించుకున్నామని, బోటు సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్నబియ్యం, ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. రైతుబంధు రూ. 16 వేల రూపాయలకు పెంచుతామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు వికలాంగుల పింఛను రూ.  6000 రూపాయలకు పెంచుతామన్నారు. గత పాలకులు కేవలం మైనార్టీలను ఓటర్లు గానే చూశారని, తమ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి లక్షలాది రూపాయల ఖర్చు పెట్టారన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమత - ప్రశాంత్ రెడ్డి, ఇల్లందుల కృష్ణమూర్తి, సరేష్,  మోభిన్, పెంచాల శ్రీధర్, పైడ రవి, తబ్రీజ్, ఖదీర్, అవునూరి రవి, కుంభం సంతోష్, జంబు భాయ్, జావేద్, అజీజ్, వెన్నం రవి,అఖిల్, నిఖిల్ తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.