కెసిఆర్ సభ స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్......

కెసిఆర్ సభ స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్......

ఆలేరు (ముద్ర న్యూస్):అక్టోబర్ 29న ఆలేరు పట్టణ కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ స్థలాన్ని ఆదివారము నాడు ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు. బిఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. రానున్న ఎన్నికలలో ముచ్చటగా మూడవసారి భారతీయ రాష్ట్ర సమితికి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోష్యం చెప్పారు.

29న జరిగే బహిరంగ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోరెడ్డి శ్రీనివాస్. మున్సిపల్ కౌన్సిలర్లు బేతి రాములు. రాయపురం నరసింహులు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి వెంకటేష్. జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఆడేపు బాలస్వామి. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్. మాజీ అధ్యక్షులు మొరిగాడి వెంకటేష్ గౌడ్. నాయకులు జూకంటి వెంకటేష్. వజ్పరి శివ కుమార్. దయ్యాల సంపత్. సరాబ్ సంతోష్ కుమార్. కుతాటి అంజన్ కుమార్. జింకల భరత్ యాదవ్. పూల శ్రవణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు..