విద్యుత్ షాక్ తో మృతిచెందిన వారికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి
ముద్ర, వలిగొండ : వలిగొండ మండలం నాగారం గ్రామం లో వ్యవసాయ పొలంలో కౌలు రైతులు బండ అంజయ్య, బండ జంగమ్మ భార్యాభర్తలు ఇద్దరు పశువులకు గడ్డి కొస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ అఘాతం తో మృతి చెందగా విషయం తెలుసుకున్న భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి రామన్నపేట ప్రభుత్వ వైద్యశాల లోని మార్చురీ గదిలోని మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ప్రభుత్వం నుండి వచ్చే ఎక్సగ్రేషియా ను అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.