ఐసీసీ వరల్డ్ కప్ అహ్మాదాబాద్ ఫ్లయిట్ టికెట్లు ఫుల్!
న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ కప్–2023 ఫైనల్ భారత్–ఆసీస్ మధ్య అహ్మాదాబాద్లో ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో విమానయానశాఖకు చెందిన గుజరాత్, అహ్మాదాబాద్ అన్ని విమానాల్లోనూ టికెట్లు ఫుల్ అయిపోయాయి. క్రికెట్ మ్యాచ్ వల్ల ఏయిర్ఇండియాకు చెందిన అన్ని టికెట్లు అమ్ముడుపోయాయని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇతర ఎయిర్లైన్ టికెట్లలో భారీ పెరుగుదల ఉన్నట్లు తెలిపారు. అహ్మాదాబాద్కు 18, 19వ తేదీల్లో వచ్చే విమానాల టికెట్లు రూ. 45వేలుగా తెలిపారు.
ALSO READ: భారత్–ఆసీస్ నేడే తుదిపోరు
ఢిల్లీ నుంచి అహ్మాదాబాద్కు 18, 19న ఇండిగోలో రూ. 31వేలు, చెన్నై నుంచి అహ్మాదాబాద్కు రూ. 37వేలు, కోల్కత్తా నుంచి అహ్మాదాబాద్కు రూ. 45వేలుగా ఉందని అన్నారు. సామాన్య రోజుల్లో టికెట్ల ధరలు ఈ రేంజ్లో ఉండవన్నారు. రూ. 10వేలు తక్కువగానే ఉంటాయన్నారు. వరల్డ్కప్ మ్యాచ్ డిమాండ్ నేపథ్యంలో టికెట్ల ధరల్లో పెరుగుదల చోటు చేసుకుందన్నారు. క్రికెట్ ప్రేమికులు టికెట్ల ధరలను లెక్కచేయకపోవడంతో డిమాండ్ భారీగా పెరుగుతోందన్నారు. ప్రస్తుతం 55వేల వరకూ అహ్మాదాబాద్కు టికెట్ల ధర కొనసాగుతోందన్నారు.