ఐసీసీ వరల్డ్​ కప్​ అహ్మాదాబాద్​ ఫ్లయిట్​ టికెట్లు ఫుల్​!

ఐసీసీ వరల్డ్​ కప్​ అహ్మాదాబాద్​ ఫ్లయిట్​ టికెట్లు ఫుల్​!

న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్​ కప్​–2023 ఫైనల్​ భారత్​–ఆసీస్​ మధ్య అహ్మాదాబాద్​లో ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో విమానయానశాఖకు చెందిన గుజరాత్​, అహ్మాదాబాద్​ అన్ని విమానాల్లోనూ టికెట్లు ఫుల్​ అయిపోయాయి. క్రికెట్​ మ్యాచ్​ వల్ల ఏయిర్​ఇండియాకు చెందిన అన్ని టికెట్లు అమ్ముడుపోయాయని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇతర ఎయిర్​లైన్​ టికెట్లలో భారీ పెరుగుదల ఉన్నట్లు తెలిపారు. అహ్మాదాబాద్​కు 18, 19వ తేదీల్లో వచ్చే విమానాల టికెట్లు రూ. 45వేలుగా తెలిపారు.

ALSO READ: భారత్​–ఆసీస్​ నేడే తుదిపోరు

ఢిల్లీ నుంచి అహ్మాదాబాద్​కు 18, 19న ఇండిగోలో రూ. 31వేలు, చెన్నై నుంచి అహ్మాదాబాద్​కు రూ. 37వేలు, కోల్​కత్తా నుంచి అహ్మాదాబాద్​కు రూ. 45వేలుగా ఉందని అన్నారు. సామాన్య రోజుల్లో టికెట్​ల ధరలు ఈ రేంజ్​లో ఉండవన్నారు. రూ. 10వేలు తక్కువగానే ఉంటాయన్నారు. వరల్డ్​కప్​ మ్యాచ్​ డిమాండ్​ నేపథ్యంలో టికెట్ల ధరల్లో పెరుగుదల చోటు చేసుకుందన్నారు. క్రికెట్​ ప్రేమికులు టికెట్ల ధరలను లెక్కచేయకపోవడంతో డిమాండ్​ భారీగా పెరుగుతోందన్నారు. ప్రస్తుతం 55వేల వరకూ అహ్మాదాబాద్​కు టికెట్ల ధర కొనసాగుతోందన్నారు.