భవ్య, వైష్ణవి మృతదేహాలపై  గాయాలు.. 

భవ్య, వైష్ణవి మృతదేహాలపై  గాయాలు.. 

ముద్ర ప్రతినిధి భువనగిరి: ఎస్సీ హాస్టల్ విద్యార్థులు భవ్య వైష్ణవి మృతదేహాలపై తీవ్రమైన గాయాలు, వాతలు, పండ్లతో కొరికిన గాయాలు ఉన్నట్లు భవ్య అక్క కృష్ణవేణి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బాడీని మాకందించారని పరిశీలించగా తీవ్రమైన గాయాలు ఉన్నట్లు విలపిస్తూ చెప్పారు. వార్డెన్, పి ఈ టి, ఆటో నిర్వాహకులు ఆంజనేయులు, వంట మనిషిని విచారించి వారిపై చర్య తీసుకోవాలని కోరారు. పోస్టుమార్టం రిపోర్టును,  పోలీసులు పంచానామాను బయటపెట్టాలని కోరారు.