గురుకుల పాఠశాలలను తనిఖీ చేసిన జడ్జి
![గురుకుల పాఠశాలలను తనిఖీ చేసిన జడ్జి](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6403533013c7c.jpg)
ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోట లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, మదనాపురం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో గల సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరైన విద్యతో పాటు మంచి రుచికరమైన ఆహారం, పరిశుభ్రమైన వసతి అందించాలని ప్రిన్సిపాల్ లను, వంట చేసే సిబ్బందిని ఆదేశించారు.
మదనపురం గురుకుల పాఠశాలలో వంట గదులు, స్నానాల గదులు, మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేవని ప్రిన్సిపాల్ పై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాలతి, మదనాపురం బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్, లోక్ అదాలత్ సిబ్బంది రూప, రాణి, విద్యవతి తదితరులు పాల్గొన్నారు.