నిర్మల్ నియోజకవర్గం లో ప్రవేశించిన కాంగ్రెస్ పాదయాత్ర

నిర్మల్ నియోజకవర్గం లో ప్రవేశించిన కాంగ్రెస్ పాదయాత్ర

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించిన హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర శనివారం నిర్మల్ నియోజవర్గంలోకి ప్రవేశించింది. సిర్గాపూర్ పరిసరాల్లో ప్రజలు, అభిమానులు పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు అభిమానులు హర్షద్వానాలతో మహేశ్వర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.