రాజ్యాధికారంతోనే మన వర్గాలకు న్యాయం జరుగుతుంది  గొంగళ్ల రంజిత్ కుమార్

రాజ్యాధికారంతోనే మన వర్గాలకు న్యాయం జరుగుతుంది  గొంగళ్ల రంజిత్ కుమార్

6వ రోజు నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో పలు గ్రామప్రజలు సంఘీభావం.

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి: ధరూర్  మండలంలోని గొంగళ్ల రంజిత్ కుమార్. ఆధ్వర్యంలో 6వ రోజు కొనసాగిన నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర బుధవారం ఉదయం ఉప్పేరు నుండి గుడ్డెందొడ్డి, వామన్ పల్లి, నర్సన్ దొడ్డి. గ్రామం వరకు కొనసాగింది. మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత సాయంత్రం చిన్న చింతరేవుల, రేవులపల్లి, పెద్ద చింతరేవుల వరకు చేరింది. అలాగే నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా గుడ్డెందొడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ కి గ్రామస్తులు, మహిళామణులు పెద్ద ఎత్తున ఎడ్లబండిపై ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు.

వామన్ పల్లి గ్రామంలో మహిళలు ప్రత్యేకంగా హారతులు పట్టి రంజిత్ కుమార్. కి వీర తిలకం దిద్ది  ఘనస్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో మల్దకల్ మండలంలోని సద్దనోనిపల్లి, అమరవాయి అలాగే ధరూర్ మండలంలోని ఓబులోనిపల్లి గ్రామ ప్రజలు పాల్గొని నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర కు సంఘీభావం తెలిపారు.