బాసర అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్ తనయుడు హిమాంశు

బాసర అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్ తనయుడు హిమాంశు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రికేటీ రామారావు తనయుడు హిమాంశు రావు బాసర సరస్వతీ అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.ఆలయానికి చేరుకున్న హిమాన్షు రావు ఆలయ అర్చకులు, వేద పండితులుశ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో  ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ ,ప్రధాన అర్చకులు సంజీవ్ కుంకుమార్చన తో పాటు ప్రత్యేక పూజలు జరిపించారు.