ఖమ్మం కార్పొరేషన్ కు రూ. 100 కోట్లు విడుదల
ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఖమ్మంకు మరోసారి నిధుల వరద పారించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు చేసిన విజ్ఞప్తి మేరకు టీయూఎఫ్ఐడీసీ (తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ద్వారా ఖమ్మంకు రూ. 100 కోట్లు విడుదల చేశారు. శుక్రవారం ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీవో కాపీ ని మంత్రి పువ్వాడకు అందజేశారు.