ఖమ్మం కార్పొరేషన్ కు రూ.  100 కోట్లు విడుదల 

ఖమ్మం కార్పొరేషన్ కు రూ.  100 కోట్లు విడుదల 

ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్  నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఖమ్మంకు మరోసారి నిధుల వరద పారించారు.  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  మున్సిపల్​ శాఖ మంత్రి  కేటీఆర్ కు  చేసిన విజ్ఞప్తి మేరకు టీయూఎఫ్​ఐడీసీ (తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ద్వారా ఖమ్మంకు రూ. 100 కోట్లు  విడుదల చేశారు.  శుక్రవారం  ఐటి,  పురపాలక శాఖ  మంత్రి కేటీఆర్  జీవో కాపీ ని మంత్రి పువ్వాడకు  అందజేశారు.