లక్ష్యం కోసం బీజేపీలో చేరా... ఆ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు 

లక్ష్యం కోసం బీజేపీలో చేరా... ఆ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు 

లక్ష్యం కోసం బీజేపీలో చేరామని, ఆ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి తెలిపారు. ఆయన టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్​ రెడ్డి కొత్త బిచ్చగాడని వ్యాఖ్యానించారు. రేవంత్​ రెడ్డి బీజేపీలోకి వచ్చినా పార్టీలో  చేర్చుకోవడం కష్టమన్నారు. ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదన్నారు. క్లీన్​ ఇమేజ్​ ఉన్నవారినే బీజేపీ చేర్చుకుంటుందని అన్నారు. కాంగ్రెస్​లో రేవంత్​ రెడ్డి వలసవాది అన్నారు. తమలాంటివారిని కాంగ్రెస్​లోకి ఆహ్వానించడం హాస్యాస్పదమని రాజగోపాల్​ రెడ్డి అన్నారు.