లక్ష్యం కోసం బీజేపీలో చేరా... ఆ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు
లక్ష్యం కోసం బీజేపీలో చేరామని, ఆ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కొత్త బిచ్చగాడని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వచ్చినా పార్టీలో చేర్చుకోవడం కష్టమన్నారు. ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదన్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్నవారినే బీజేపీ చేర్చుకుంటుందని అన్నారు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వలసవాది అన్నారు. తమలాంటివారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించడం హాస్యాస్పదమని రాజగోపాల్ రెడ్డి అన్నారు.