సియం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షిరాబిషేకం
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణలో మేర కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో మేరు సంఘం అధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చిత్రపటాలకు క్షిరాబిషేకం చేసి స్వీట్లు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా మేరు సంఘం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేరు సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, వంద రోజుల్లోనే మేరు కార్పొరేషన్ సహకరించిన మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేరు సేవ సంఘం అధ్యక్షులు గట్ల రమేష్, పట్టణ అధ్యక్షులు మాడిశెట్టి మల్లేశం, పట్టణ ప్రధాన కార్యదర్శి రాపర్తి గణేష్, సహాయ కార్యదర్శి రాపర్తి రమాదేవి , జిల్లా మాజీ అధ్యక్షులు, సలహాదారులు గట్ల హనుమాండ్లు, జిల్లా కన్వీనర్ వెన్న మహేష్, సలహాదారులు కొక్కు శ్రీనివాస్, సలహాదారులు గట్ల రాధాకృష్ణ, డైరెక్టర రాగిల నరేష్,రాచర్ల గంగాధర్, కాంగ్రెస్ నాయకులు సంఘ శ్రీనివాస్, గట్ల రామ్ ప్రసాద్, జిఆర్ శ్రీనివాస్, గట్ల చంద్రయ్య, గట్ల గౌరయ్య, రామగిరి రమేష్ ( బత్కపెల్లి), గట్ల భూమయ్య, ఓదెల ముఖేష్, గట్ల సత్తయ్య, గట్ల రాజ్ కిషన్, సోమ తిరుపతి, రాపర్తి శ్రవణ్, సింగ్ మురళి, సింగ్ నరసయ్య, ఓదెల నవీన్, ఓదెల అమర్ రాగిల శ్రీకాంత్ , తదితరులు పాల్గొన్నారు.