మంత్రి శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన  లొంక కేసారం సర్పంచ్ ఎండి.మంజూర్..

మంత్రి శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన  లొంక కేసారం సర్పంచ్ ఎండి.మంజూర్..

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: రామగిరి మండలంలోని  లొంక కేసారం సర్పంచ్ ఎండి.మంజూర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ను హైదరాబాద్ సెక్రెటేరియెట్ లోని తన చాంబర్లో కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరంలొంక కేసారం గ్రామ అభివృద్ది కోసం నిధులు కేటాయించాలని కోరారు. గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం,  బ్రిడ్జి, వీధి దీపాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి కి వినతిపత్రం అందజేశారు.లొంక కేసారం, కల్వచర్ల రెండు గ్రామాలకు సంబంధించి రైతులు, ప్రజల రాకపోకలకు వీలు లేకుండా మధ్యలో వాగు ఉన్నందున వాగు పైన బ్రిడ్జి వేసి లొంక కేసారం లోని ఖబ్రస్తాన్ నుండి పెద్దమ్మతల్లి టెంపుల్ మీదుగా మరుతినగర్ వరకు  సీసీ రోడ్డు నిర్మాణం కొరకు నిధులు కేటాయించవలసిందిగా మంత్రిని కోరారు.అదేవిధంగా లొంక కేసారంలోని క్రీడా ప్రాంగణం నుండి వైకుంఠధామం వరకు నిత్యం రైతులు,ప్రజలు వెళ్ళే ప్రధాన రహదారి సరిగా లేనందున,  రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు లేకపోవడం, వర్షాకాలం సమయంలో రహదారి బురదమయం కావడంతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరన్నారు. అలాగే వైకుంఠధామానికి వెళ్లడానికి వీలు లేకుండా మధ్యలో ఉన్నటువంటి ఎస్సారెస్పీ కెనాల్ పై ఉన్న చిన్న బ్రిడ్జిని కాస్త వెడల్పు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించగలని  తెలిపారు.  సీసీ రోడ్డు నిర్మాణం, వీధి దీపాలు, బ్రిడ్జి కొరకు నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని మంత్రి ని కోరారు. ఆయన వెంట కల్వచర్ల మాజీ సర్పంచ్ దేవ రామస్వామి, తదితరులు ఉన్నారు.