శ్రీ కోదండ రాముని ఆశీర్వాదాలతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి...
- అప్పన్న పేటలో కోదండ రాముని విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే విజయరామణారావు
ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: శ్రీ కోదండ రాముని ఆశీర్వాదాలతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయ రామణారావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి మండలంలోని అప్పన్న పేట గ్రామంలో ఎమ్మెల్యే విజయరమణ రావు. శ్రీ శ్రీ శ్రీ కోదండ రామాలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సునీత రాజేందర్ యాదవ్, గోపగాని సారయ్య గౌడ్, దేవాలయ చైర్మన్ మండల భాస్కర్ రెడ్డి, ముద్దశాని రాజీ రెడ్డి, మాజీ సర్పంచ్ మండల సత్యనారాయణ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆరే సంతోష్, తమ్మనవెని శ్రీనివాస్, బొన్ల శ్రీనివాస్, రాపెల్లి సంతోష్, అనుమల మహేష్, రాపెళ్ళి రమేష్, వేల్పుల శ్రీనివాస్, కొండేటి రాజయ్య, తోట సంజీవ్, జూలపల్లి సర్పంచ్ నర్సింగ్, కట్కురి సుధాకర్ రెడ్డి, రాఘవపూర్ సర్పంచ్ వెంకటేష్, అడపా వెంకటేశం, ఓదెలు యాదవ్, సాంబి రెడ్డి, గన్నమనేని తిరుపతి రావు, తదితరులు పాల్గొన్నారు.