స్మార్ట్ సిటీ కూలి మృతి
![స్మార్ట్ సిటీ కూలి మృతి](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63db4bc1a1e48.jpg)
ముద్ర, కరీంనగర్ ప్రతినిధి: కరీంనగర్ లోని తిరుమల్ నగర్ లో స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా డ్రైనేజీ నిర్మిస్తున్న క్రమంలో ప్రహరీ గోడ కూలి బీహార్ కి చెందిన గంగారం అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శిథిలాలకింది ఇరుక్కొని మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటన జరిగిన తీరుపై విచారణ చేస్తున్నారు. ప్రమాద దృశ్యాలు పక్క భవనంలో ఉన్న సి సి కెమెరా లో రికార్డ్ అయ్యాయి.