బీజేపీ మీ ఇంటి పార్టీ కాదు

బీజేపీ మీ ఇంటి పార్టీ కాదు

 బీజేపీ సీనియర్ నాయకులు బేతి మహేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : అనేక ఏళ్లుగా బీజేపీ సిద్దాంతాలకు కట్టుబడి పార్టీ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించి కమిట్మెంట్ తో పని చేస్తున్న నాయకులను, కార్యకర్తలను విస్మరించడం బాధాకరమని బీజేపీ కరీంనగర్ నియోజకవర్గ నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. కరీంనగర్ కేంద్రంగా మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు ప్రకాష్ జవదేకర్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పార్టీ కోర్ కార్యకర్తలను కలిసే ఎజెండా ఉన్నప్పటికీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం సంబంధిత రాష్ట్ర, జిల్లా నాయకుల ఒంటెద్దు పోకడలకు నిదర్శనమని విమర్శించారు. బీజేపీ పార్టీని తమ ఇంటి పార్టీలా వ్యవహారిస్తూ పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాగే వ్యవహారిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఒంటెద్దు నిర్ణయాలు, పోకడల పై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సకల హంగులతో నిర్మించిన కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ లో కాకుండా బీఆర్ఎస్ ముఖ్య నేత హోటల్లో ప్రకాష్ జవదేకర్ కు బస, మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలకు తావిచ్చారని మండిపడ్డారు.