పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన రోహిత్ గౌడ్ వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్పై కాల్వ శ్రీరాంపూర్ నుంచి మల్యాలకు వెళ్లి, తిరిగి వస్తుండగా రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద అదుపు తప్పి ద్విచక్ర వాహనం బోల్తా పడింది.దీంతో రోహిత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థాని కులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై శ్రీనివాస్ రోహిత్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి హాస్పి టల్కు తరలించారు.కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.