300 పడకల ఆసుపత్రి నిర్మాణ  పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

300 పడకల ఆసుపత్రి నిర్మాణ  పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని 300 పడకల ఆసుపత్రి  నిర్మాణ పనులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పరిశీలించారు.
   
ఎమ్మెల్యే మాట్లాడుతూ   

సీఎం కేసీఆర్. సహకారంతో గద్వాలలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో అన్ని రకాలు ఆపరేషన్లు చేయడం తో పాటు అధునాతన పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే అన్ని చికిత్సలకు వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. 
త్వరగా ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, కౌన్సిలర్స్ మురళి, శ్రీను, కృష్ణ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగులు యాదవ్ , భగీరథ వంశీ, కురుమన్న, కృష్ణ, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.