పాముకాటుతో వ్యక్తి మృతి

పాముకాటుతో వ్యక్తి మృతి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : మల్దకల్ మండల కేంద్రానికి చెందిన వెల్డింగ్ శ్రీనివాసచారి (56) పాముకాటుకు గురై మంగళవారం రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహితుని పని నిమిత్తం నందికొట్కూరుకు వెళ్ళిన శ్రీనివాసులు వ్యవసాయ పొలంలో పాము కాటు వేసినట్లు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది మృతునికి భార్య ఇద్దరు కుమారులు, ఉన్నారు. అందరిలో కలిసిమెలిసి ఉండే శ్రీనివాసులు హఠాన్మరణం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలు మల్దకల్లులో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.