పట్టపగలే భారీ చోరీ

పట్టపగలే భారీ చోరీ
  • రాంనగర్ కాలనీలో ఘటన 
  • 12 తులాల బంగారం 90 వేల నగదు చోరీ

ముద్ర, షాద్ నగర్:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో పట్టపగలే చోరీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు రాజు యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో 12తులాల బంగారం, సుమారు 90 వేల నగదు చోరీకి పాల్పడ్డట్టు బాధితుడు రాజు మీడియాకు వివరించారు. పగలే జరిగిన దొంగతనం సమాచారం తెలుసుకున్న క్లూస్ టీం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.. షాద్నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.