భార్యను హతమార్చి కరెంట్ షాక్ తో నమ్మించే ప్రయత్నం..!

భార్యను హతమార్చి కరెంట్ షాక్ తో నమ్మించే ప్రయత్నం..!

అగ్నిసాక్షిగా వివాహమాడి ఏడడుగులు నడిచిన భార్యను దారుణంగా కొట్టి చంపి దానిని కరెంట్ షాక్ తో మృతి చెందినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఓ భర్త ఉదంతం ఇది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందూర్గు మండల కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో వివాహిత సున్నాల కవిత మృతి చెందింది. కరెంట్ షాక్ తో చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు భర్త సున్నాల యాదయ్య. సంఘటన స్థలానికి వచ్చి చూసిన స్థానికులు, పోలీసులు ఆమెది కరెంట్ షాక్ తో సంభవించిన మరణం కాదని తెలుసుకున్నారు. ఒంటిపై తీవ్ర రక్త గాయాలు కనిపించడంతో అవాక్కయ్యారు. అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమె మృదేహాన్ని చూసి హత్యగా ధ్రువీకరించుకుంటున్నారు. ప్రస్తుతం సున్నాల యాదయ్య కొందూర్గు పోలీసుల అదుపులో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూసి అవకాశం ఉంది..