రక్షణ మరింత బలోపేతం
- ఫ్రాన్స్ ఐదో వార్షిక సమావేశంలో మంత్రులు
ఫ్రాన్స్: రక్షణ–పారిశ్రామిక శాఖల్లో భారత్–ఫ్రాన్స్ మధ్య మరింత సహకారం కొనసాగుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, ఫ్రాన్స్ సాయుధ దళాల మంత్రి సెబాస్టియన్ లెకోర్న్లు ప్రకటించారు. రెండురోజుల యూరప్ పర్యటనలో ఉన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో ఫ్రాన్స్ మంత్రి ఐదో వార్షిక రక్షణ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య మిలటరీకి యుద్ధ విన్యాసాలు, నూతన యుద్ధరీతుల ప్రదర్శనలు నిర్వహిస్తుంటామన్నారు. ఫ్రాన్స్–భారత్కు రక్షణ ప్రాజెక్టుల విషయంలో పలు కీలక విషయాలను చర్చించారు. రెండు దేశాల మధ్య ఈ సహకారం మరింత పెంపొందించాలని ఈ సమావేశంలో నిర్వహించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. అదే సమయంలో రక్షణ శాఖలో సైబర్, స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి వాటిని సమర్థంగా వినియోగించడం, ఎదుర్కొనడం కూడా రాజ్నాథ్సింగ్, సెబాస్టియన్లు అధికారుల బృందంతో కలిసి చర్చించారు.