రక్షణ మరింత బలోపేతం

రక్షణ మరింత బలోపేతం
  • ఫ్రాన్స్​ ఐదో వార్షిక సమావేశంలో మంత్రులు

ఫ్రాన్స్​: రక్షణ–పారిశ్రామిక శాఖల్లో భారత్​–ఫ్రాన్స్​ మధ్య మరింత సహకారం కొనసాగుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​, ఫ్రాన్స్​ సాయుధ దళాల మంత్రి సెబాస్టియన్​ లెకోర్న్​లు ప్రకటించారు. రెండురోజుల యూరప్​ పర్యటనలో ఉన్న రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​తో ఫ్రాన్స్​ మంత్రి ఐదో వార్షిక రక్షణ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య మిలటరీకి యుద్ధ విన్యాసాలు, నూతన యుద్ధరీతుల ప్రదర్శనలు నిర్వహిస్తుంటామన్నారు. ఫ్రాన్స్​–భారత్​కు రక్షణ ప్రాజెక్టుల విషయంలో పలు కీలక విషయాలను చర్చించారు. రెండు దేశాల మధ్య ఈ సహకారం మరింత పెంపొందించాలని ఈ సమావేశంలో నిర్వహించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. అదే సమయంలో రక్షణ శాఖలో సైబర్​, స్పేస్​, ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​ వంటి వాటిని సమర్థంగా వినియోగించడం, ఎదుర్కొనడం కూడా రాజ్​నాథ్​సింగ్​, సెబాస్టియన్​లు అధికారుల బృందంతో కలిసి చర్చించారు.