శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు
- మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ హెచ్చరిక
మణిపూర్: వివాదాస్పద వీడియోలను షేర్ చేస్తూ మణిపూర్లో శాంతికి భంగం వాటిల్లేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆ రాష్ర్ట సీఎం వీరేన్సింగ్ మరోమారు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మణిపూర్ అల్లర్లలో ఆస్తుల నష్టానికి పాల్పడిన వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. ఈ రకమైన వీడియోలు, ఆస్తుల ధ్వంసంతో సామాన్య జనజీవనానికి ఆటంకాలు కల్పించే చర్యలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. రాష్ర్ట ప్రభుత్వం, హోంశాఖ సోషల్ మీడియాపై ఓ కన్నేసిందన్నారు. హింసాత్మక వీడియోలను ప్రసారం చేయవద్దన్నారు. ఒకవేళ హింసాత్మక వీడియోలపై ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మణిపూర్ శాంతిలో, అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నదే తమ అభిమతమన్నారు. అంతేగాని ఎవ్వరైనా ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. కాగా 230 స్థానాలున్న మధ్యప్రదేశ్లో గెలుపుకోసం బీజేపీ, ఇండియా కూటమి కాంగ్రెస్లు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి.