మణిపూర్లో 1195 ఆయుధాల స్వాధీనం
- 10 కంపెనీల సెంట్రల్ఫోర్స్మోహరింపు
మణిపూర్: మణిపూర్లో చెలరేగుతున్న హింస కారణంగా కేంద్రం అదనంగా మరో 10 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ను శనివారం మోహరించింది. కాగా పోలీసులు, సెర్చ్ఆపరేషన్లో ఇటీవలే ఎత్తుకెళ్లిన 1195 ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. కాగా ఈ సెర్చ్ ఆపరేషన్ఆదివారం ఉదయం వరకూ కొనసాగడం విశేషం. మరోవైపు 10 కంపెనీల బలగాల్లో సీఆర్పీఎఫ్5 టీమ్లు, బీఎస్ఎఫ్కు చెందిన 3, ఐటీబీపీ, ఎస్ఎస్బీకి చెందిన ఒక్కో కంపెనీని అదనంగా నియమించింది. నరంసేన పోలీస్ స్టేషన్లపై దాడి చేసి 685 ఆయుధాలు, 20 వేలకు పైగా కాట్రిడ్జ్లను దుండగులు దోచుకున్నారు. ఆయుధాల్లో ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్, హ్యాండ్ గన్లు, మోర్టార్లు, కార్బైన్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, బాంబులు ఉన్నాయి. రాష్ట్రంలోని లోయలోని పోలీస్ స్టేషన్లే కాకుండా కొండపాక జిల్లాల్లోనూ దోపిడీలు జరుగుతున్నాయని పోలీస్ కంట్రోల్ రూం వెల్లడించింది. ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు భద్రతా బలగాలు కొండలు, లోయ ప్రాంతాల్లో నిరంతరం సోదాలు ముమ్మరం చేశారు.