ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
  •  వేడుకలలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
  • ‘యుగపురుషుడు’ పుస్తకం ఆవిష్కరణ 

 ముద్ర, కూకట్ పల్లి : టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు కూకట్ పల్లి ఖైతాలపూర్ గ్రౌండ్ లో అతిరథ మహారథులు, అభిమానులు, కార్యకర్తల మధ్య శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీపీఐ జాతీయ నాయకుడు సీతరాం ఏచూరి, ప్రముఖ సినీ నటులు బాలకృష్ణ, రామ్ చరణ్, జయసుధ, జయప్రద, వెంకటేశ్, మురళీమోహన్, నాగచైతన్య, సుమంత్, పునీత్ రాజ్ కుమార్, ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు, పలువురు నేతలు మాట్లాడారు. ఎన్ని తరాలైనా మర్చిపోలేని మహానాయకుడు, యుగపురుషుడు ఎన్టీ రామారావు అని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ‘యుగ పురుషుడు’ అనే పుస్తకాన్ని  ఆవిష్కరించారు. కార్యక్రమంలో శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టీ జనార్దన్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.