అధికార పార్టీ కనుసన్నల్లోనే పిడిఎస్ రైస్ మాఫియా: ఏ ఐ ఎఫ్ బి నేత అంబటి జోజిరెడ్డి

అధికార పార్టీ కనుసన్నల్లోనే పిడిఎస్ రైస్ మాఫియా: ఏ ఐ ఎఫ్ బి నేత అంబటి జోజిరెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే రేషన్ మాఫియా కొనసాగుతుందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజి ఆరోపించారు. రేషన్ మాఫియా పై కఠినంగా వ్యవహరించాలని మంత్రి గంగుల కమలాకర్ పలుమార్లు పోలీసులను ఆదేశించినా ఎలాంటి మార్పు లేకపోవడం శోచనీయం అన్నారు. అప్పటి పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ పిడిఎస్ రైస్ తో వ్యాపారం కొనసాగిస్తున్న వేణుగోపాల్, గంగిరెడ్డి, రామృష్ణతో పాటు పలువురిపై పీడీ యాక్టు పెడ్తామని వెల్లడించినట్లు ఈ సందర్భంగా వివరించారు.

నిరుపేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడాన్ని ఆయన తప్పు పట్టారు. రేషన్ బియ్యం దందా మంత్రి అనుచరులే చేస్తున్నారని, అందుకే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా పేదల బియ్యం పై వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ళ శ్రీనివాస్ పై పీడీ యాక్ట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఆయన తప్పు పట్టారు. బిఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒకలా బయటికి వస్తే మరోలా వ్యవహరించడాన్ని కరీంనగర్ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.