దిలీప్ కొణతంకు పీఆర్ సీ ఐ  “సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్” అవార్డు

దిలీప్ కొణతంకు పీఆర్ సీ ఐ  “సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్” అవార్డు

మరో నాలుగు అవార్డులు కైవసం చేసుకున్న తెలంగాణ ఐటీ శాఖ

తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్ సీఐ) ఎక్సలెన్స్ అవార్డులను ఐదు విభాగాలలో గెలుచుకుంది.  సెప్టెంబర్ 21- 22 తేదీల్లో జరిగిన 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్ లో ఈ అవార్డులను ప్రదానం చేశారు.  కేంద్ర మాజీ మంత్రి  ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేతుల మీదుగా డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం "సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్" అవార్డును అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును పీఆర్ సీ అందజేస్తుంది.

ఈ అవార్డుతో పాటు, డిజిటల్ మీడియా విభాగం 2023 సంవత్సరానికి గాను మరో నాలుగు పీఆర్ సీఐ ఎక్సలెన్స్ అవార్డులను గెలుచుకుంది. సోషల్ మీడియా ఉత్తమ వినియోగం అవార్డు, ఉత్తమ వార్షిక నివేదిక అవార్డు (తెలంగాణ ఐటీ శాఖ వార్షిక నివేదిక 2022-23కి), ప్రజా సేవల ప్రకటనల అవార్డు (“మన ట్యాంక్‌బండ్‌ని శుభ్రంగా, అందంగా ఉంచుకుందాం” వీడియోకి), ఉత్తమ ప్రభుత్వ కమ్యూనికేషన్ ఫిల్మ్స్ ("కాళేశ్వరం -తెలంగాణ జల విప్లవం" వీడియోకి) లభించాయి. తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తరపున సహాయ సంచాలకులు, డిజిటల్ మీడియా ముడుంబై మాధవ్, డిజిటల్ మీడియా కన్సల్టెంట్ నరేందర్ గుండ్రెడ్డి ఈ అవార్డులు అందుకున్నారు.

డిజిటల్ మీడియా విభాగం గురించి
ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం  2014 జూన్ లో ఏర్పాటయింది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని, సేవలను డిజిటల్ మాధ్యమాలలో పౌరులకు చేరవేయడం ఈ విభాగం ప్రధాన బాధ్యత. సామాజిక మధ్యమాల ఖాతాల సృష్టి, నిర్వహణ; వెబ్‌సైట్‌లు/పోర్టల్‌ల రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ; ఓపెన్ గవర్నమెంట్ డేటా, కంటెంట్ స్థానికీకరణ, ఫ్యాక్ట్ చెక్, తెలంగాణ డిజిటల్ రిపాజిటరీ కార్యక్రమాల అమలు డిజిటల్ మీడియా విభాగం ఇతర ప్రధాన విధులు.  ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి సామాజిక మాధ్యమాలపై సాంకేతిక సంస్థల నిపుణులచేత శిక్షణా కార్యక్రమాలను డిజిటల్ మీడియా విభాగం నిర్వహిస్తుంది.