జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తప్పుడుప్రచారం చేస్తున్న వారి పై చర్యలు తిసుకోవాలి-షాద్నగర్ పోలీస్ స్టేషన్లో జనసైనికుల ఫిర్యాదు
ముద్ర, షాద్నగర్:-జనసేన అదినేత పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబం గురించి తప్పుడుప్రచారం చేస్తున్న వారి పై చర్యలు తిసుకోవాలని జనసైనికులు షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి తప్పుడుప్రచారం చేస్తున్న వైసీపీ నేతల పై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.ఫిర్యాదు చేసిన వారిలో జనసేన నాయకులు జర్పుల రాజు నాయక్ , ఎండీ అష్రాఫ్, కొర్ర శంకర్ నాయక్, పవన్ నాయక్, నాని,నరేష్ నాయక్, దాసరి శ్రీను,లింగం,శివ, మహిపల్, యాదయ్య,శ్రీను, చందర్,అసిఫ్ తదితరులు ఉన్నారు.