అభివృద్ధి పథకం విరాళామందించిన ఓగుల అజయ్

అభివృద్ధి పథకం విరాళామందించిన ఓగుల అజయ్

సారంగాపూర్ ముద్ర:సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామంలో పోచమ్మ గుడి నిర్మాణానికి శ్రీకృష్ణ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు అజయ్ వినీల దంపతులు 20వేల రూపాయల గుడి నిర్మాణ కమిటీ నిర్వాహకులు పాంపర్తి రంజిత్ కు అందజేశారు. అలాగే   ఉపాధి నిమిత్తం దుబాయ్ ఉంటున్న సాంబ బీరయ్య సైతం తనవంతుగా 20వేల రూపాయల విరాళాన్ని అందజేశారు. గుడి నిర్మాణానికి గ్రామంలోని అన్ని కుల సంఘాల తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశాయి. అలాగే గ్రామం తో పాటు విదేశీ విదేశాల్లో ఉంటున్న వారు, వివిధ గ్రామాలకు చెందిన వారు సైతం విరాళాన్ని అందజేస్తూ పోచమ్మ గుడి నిర్మాణానికి సహకరిస్తూన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ వ్యవస్థాపక అజయ్ దంపతులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.