ఐశ్వర్య బి హబ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి 

ఐశ్వర్య బి హబ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి 

ముద్ర, దుండిగల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ కేవీఆర్ కాలనీలో మమతా రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య బి హబ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలసి ప్రారంభించారు.  నాణ్యమైన సేవలతో ప్రజల మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ ఛైర్పర్సన్ శంభీపూర్ కృష్ణవేణి కృష్ణ, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, డివిజన్ల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.