మంథని మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండ్రు రమాదేవి...?

మంథని మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండ్రు రమాదేవి...?
  • మంత్రి ఆశీర్వాదాలతో పాటు  కౌన్సిలర్ల మద్దతు కూడా రమాదేవికే...?


ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మంథని మున్సిపల్ రాజకీయాలు ఎవరు ఊహించని విధంగా మలుపు తిరిగాయి. గత 10 సంవత్సరాలుగా మంథనిలో సర్పంచ్ గా మున్సిపల్ చైర్ పర్సన్ గా ఏకచిత్రాధిపతిగా  కొనసాగుతున్న పుట్ట శైలజను ఊహించని విధంగా అవిశ్వాసం పెట్టి పదవి నుంచి తొలగించిన కౌన్సిలర్లు,  చైర్మన్ గా మళ్లీ ఎవరిని ఎన్నుకుంటారో అని మంథని పట్టణంలో ఏ నోట విన్న ఇదే చరిత్ర వినిపిస్తుంది. అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే పుట్ట శైలజ పై అవిశ్వాసం పెట్టి పదవి నుంచి తొలగించగా, మళ్లీ చైర్మన్ గా ఎవరిని ఎన్నుకుంటారని మంథనిలో ఉత్కంఠ నెలకొంది. 

మంథని మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండ్రు రమాదేవి కి అవకాశం దక్కనున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా  పనిచేస్తున్న పెండ్రు సురేష్ రెడ్డి ఆయన సతీమణి రమాదేవి కౌన్సిలర్  గా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. శ్రీధర్ బాబుకు అత్యంత నమ్మకస్తుడిగా కష్ట కాలంలో వెన్నంటే ఉన్న సురేష్ రెడ్డి దంపతులకు చైర్మన్ పదవి దక్కే ఆకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ నెల 16వ తేదీన అవిశ్వాసం పెట్టి. చైర్మన్ వైస్ చైర్మన్ లను పదవి నుంచి తొలగించగా అధికారులు చైర్మన్ ను ఎన్నుకునే తేదీని ప్రకటించాల్సి ఉంది. దీంతో ఆ రోజున మంత్రి శ్రీధర్ బాబు,  కౌన్సిలర్ల మద్దతు ఎవరికీ ఉందో వారే చైర్మన్ గా కొనసాగానున్నారు. దీంతో మంథని రెండో చైర్మన్ గా అదృష్టం ఎవరిని వారించనుందో తెలిపొనుంది.