హుస్నాబాదులో పొన్నం ఘన విజయం

హుస్నాబాదులో పొన్నం ఘన విజయం

హుస్నాబాద్ ముద్ర న్యూస్:అసెంబ్లీ ఎన్నికలలో హుస్నాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోన్నం ప్రభాకర్ ఘన  సాధించారు. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పైన 19,344 ఓట్ల  మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికలలో పొన్నం ప్రభాకర్ కు 99,769 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ కు 80,228 ఓట్లు వచ్చాయి. మరో ప్రధాన పార్టీ అయిన బిజెపి అభ్యర్థి బొమ్మ శ్రీరాం చక్రవర్తికి 8228 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. పొన్నం ప్రభాకర్ విజయంతో నియోజకవర్గంలో కాంగ్రెస్, సిపిఐ శ్రేణులు  పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చి.. మిఠాయిలు పంచి పెట్టారు. పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వారు ఆకాంక్షించారు.