బాలుడి మృతదేహానికి రీపోస్ట్ మార్టం

బాలుడి మృతదేహానికి రీపోస్ట్ మార్టం

ముద్ర ప్రతినిధి భువనగిరి : బాలుడి మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించిన సంఘటన మండలంలోని రెడ్డినాయక్ తండాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఈ నెల 11న సాయంత్రం 06:30 గంటలకు రెడ్డినాయక్ తండా కు చెందిన భూక్య భాను ప్రకాష్ - శైలజ ల 22 నెలలు వయస్సు గల కుమారుడు భూక్య విక్రమ్ ఇంటిముందు ఉన్న సంపు లో పడి మృతిచెందగా, అదే రోజు రాత్రి 11:00 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఖననం చేశారు. బాలుడి తండ్రి ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భువనగిరి రూరల్ ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు లో భాగంగా సోమవారం బాలుడి మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి మండల తహశీల్దార్ అంజిరెడ్డి, డాక్టర్ స్వప్న, భువనగిరి రూరల్ సి ఐ ప్రభాకర్ రెడ్డి, భువనగిరి రూరల్ ఎస్‌ఐ వి. సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బాలుడి మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించిన్నట్లు పోలీసులు తెలిపారు.