ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జగిత్యాలలో ట్రాఫిక్ ఆంక్షలు - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలలో ఈ నెల 18న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోకి ఆదివారం సాయంత్రం నుoడి సోమవారం సాయంత్రం వరకు భారీ వాహనాల అనుమతి లేదన్నారు. ఆదివారం, సోమవారం ఎటువంటి డ్రోన్లు పట్టణంలో ఎగురవేయ డానికి అనుమతి లేదని, అదే రోజు పదవ తరగతి పరీక్ష ఉండటంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వీలైనంత త్వరగా చేరుకొవాలని సూచించారు.
కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు ధరూర్ పెద్ద కెనాల్ బైపాస్ ద్వారా కోరుట్ల వైపు వెళ్తాయని, నిజామాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు తాటిపల్లి బైపాస్ ద్వారా ధరూర్ పెద్ద కెనాల్ మీదుగా వెళ్ళాలని సూచించారు. అలాగే ధర్మపురి నుండి కరీంనగర్ వైపు వెళ్లేవారు తమ వాహనాలను పొలాస నుండి తిమ్మాపూర్ బైపాస్ మీదుగా, ధరూర్ పెద్ద కెనాల్ వైపు వెళ్ళాలని, కరీంనగర్ నుండి ధర్మపురి వైపు వెళ్లేవారు తమ వాహనాలను ధరూర్ పెద్ద కెనాల్ వైపు నుండి తిమ్మాపూర్ బైపాస్ మీదుగా పొలాస వైపు, ధర్మపురి నుండి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు పొలాస నుండి తిమ్మాపూర్ బైపాస్ మీదుగా, ధరూర్ పెద్ద కెనాల్ బైపాస్ ద్వారా కోరుట్ల వైపు వెళ్ళాలని సూచించారు