ప్రైవేటు బస్సు దగ్ధం
![ప్రైవేటు బస్సు దగ్ధం](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64facf5739022.jpg)
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు మిర్యాలగూడ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. బుధవారం రాత్రి 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా టైరుపేలి బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను నిద్రలేపి బస్సు నుంచి కిందికి దింపివేయడంతో ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేటలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ అఫ్జల్ గంజ్ నుంచి 26 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లైఓవర్ వద్దకు రాగానే టైరు పేలి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఫ్లై ఓవర్ పక్కనే ఆగి ఉన్న ఉల్లిపాయల లోడు లారీకి కూడా మంటలు వ్యాపించాయి. స్వల్ఫంగా ఉల్లిలోడు లారీ దగ్ధమైంది. సమాచారం అందుకున్న మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.