రజత్ కుమార్ పదవీ విరమణ

రజత్ కుమార్ పదవీ విరమణ

ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ గురువారం నాడు పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సాగునీటి పారుదల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను సీనియర్ ఐఎఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కు అప్పగించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రజత్ కుమార్ అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేశారు. తాజాగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున రజత్ కుమార్ పదవి విరమణ చేయడం విశేషం. పదవీ విరమణ చేసిన రజత్ కుమార్ కు పలువురు ప్రముఖులు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.